తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ అనే సమస్య కొత్తది కాదు. ఏ సినిమా థియేటర్లో రిలీజ్ అయినా, కొన్ని గంటల్లోనే దాని పైరసీ కాపీలు ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ముఖ్యంగా
ibomma telugu movies లాంటి వెబ్సైట్లు సినిమాలను ఉచితంగా అందిస్తూ, పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి.ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. దర్యాప్తులో థియేటర్లలో కెమెరా సాయంతో రికార్డింగ్ చేసే వ్యక్తులతో పాటు, సినిమా సర్వర్లను హ్యాక్ చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
iBomma సంచలన ప్రకటన – సోషల్ మీడియాలో వైరల్
- ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో, ఐబొమ్మ తరపున ఓ సంచలన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రకటనలో సినిమాలకు అధిక బడ్జెట్ పెట్టి, ఆ భారాన్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారని పేర్కొన్నారు.
- ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, వారికోసం తాము పనిచేస్తున్నామని ఐబొమ్మ తెలిపింది.
- అయితే ఇది కొత్త ప్రకటననా లేక పాతదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు విడుదలైన విషయం గుర్తు చేసుకోవచ్చు.
సైబర్ పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి
- సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐబొమ్మ కోసం పని చేస్తున్న ఏజెంట్లను గుర్తించింది.
- ఓటీటీ కంటెంట్ను దొంగిలించి అప్లోడ్ చేస్తున్న రాకెట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
- పైరసీ ద్వారా సినిమా రంగానికి భారీ నష్టం జరుగుతోందని, ఈ సమస్యను మూలం వరకు అరికట్టాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
సినిమా పరిశ్రమకు పైరసీ అంటే పెద్ద సవాలు
ప్రతి సినిమా వెనుక వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు కష్టపడతారు. ibomma telugu moviesఅలాంటి శ్రమను ఒక్క క్లిక్తో దొంగిలించడం పరిశ్రమకు నష్టమే కాక, ప్రతీ ఒక్కరి కష్టాన్ని తక్కువ చేసే చర్య.సినీ ప్రేమికులు చట్టబద్ధమైన మార్గాల్లో సినిమాలను వీక్షించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను తగ్గించగలరు.
Also read
Hi i am Madhu i am here to provide usefull information like Govt. jobs, Govt. Schemes and latest Trending News, in Telugu Language, to help People online.